కత్తి మహేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్ అక్కర్లేని పేరు. వివిధ ఛానెళ్ళలో సినిమా రివ్యూలు చెప్పే కత్తి మహేష్ బిగ్ బాస్ సీజన్ ౧ లో పార్టిసిపేట్ చేయడంతో అందరికీ తెలిసిపోయాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు మరింత పాపులర్ అయ్యాడు. శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలకి గాను ఆరు నెలలు నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కొంత సైలెంట్ అయిన కత్తి మహేష్ మళ్ళీ విమర్శలు చేయడం ప్రారంభించాడు.


అయితే ఈ సారి బడా హీరోని కాకుండా చోటా హీరోని టార్గెట్ చేసినట్టున్నాడు. తన ఫేస్ బుక్ పేజి మీద తారల గురించి, రాజకీయాల గురించి విమర్శలు చేసే కత్తి ఇప్పుడు హీరో రజ్ తరుణ్ పై పడ్డాడు.సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే కత్తి, తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంత మందికి ఆయన శత్రువుగా మారిపోయారు. మరికొందరు మాత్రం కత్తికి సపోర్టుగా నిలుస్తున్నారు.


దీంతో ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఎంతో మందిపై పోస్టులు  పెడుతుంటాడు.తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఓ యంగ్ హీరో అయిన  రాజ్ తరుణ్ పై  సెటైర్ వేశాడు కత్తి మహేశ్. ఈ విషయంపై కత్తి మహేశ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో 'రాజ్ తరుణ్ అని ఒక హీరో ఉండాలి తెలుగు సినిమా పరిశ్రమలో. ఇంకా నటిస్తున్నాడా? ఈ మధ్య అస్సలు కనిపించలేదూ!' అని పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


రాజ్ తరుణ్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ’గుండె జారి గల్లంతయ్యిందే' ఫేం కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే కత్తి మహేష్ వ్యాఖ్యలపై రాజ్ తరుణ్ స్పందిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: