సాహో.. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా ఇది. ప్రభాస్ కేరీర్ లోనే హైలీ రిస్కీ మూవీగా చెప్పుకోవచ్చు.. కేవలం ప్రభాస్ కు బాహుబలి ద్వారా వచ్చిన ఇమేజ్ ఆధారంగా దాదాపు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రామోజీఫిలిం సిటీలో గ్రాండ్ గా జరిగింది.


ఈ వేదికపై ప్రభాస్ ఓ సంచలన విషం రివీల్ చేశాడు. ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులే నిర్మించారు. నిర్మాతలు ప్రమోద్‌, వంశీ, విక్కీ ప్రభాస్ స్నేహితులే.. వాళ్లిద్దరూ ఈ సినిమాని జాగ్రత్తగా చేసుంటే... రూ.100 కోట్లు లాభం వచ్చేదేనట. కానీ వాళ్లు అంత లాభం వదులుకొని ఈ సినిమాని ఇంత భారీగా తీశారని ప్రభాస్ అంటున్నాడు.. అందరికీ ఇలాంటి ఫ్రెండ్స్‌ ఉండాలని కోరుకుంటున్నాడు..


ప్రభాస్ ఏమన్నాడంటే..

" నిర్మాతలు ప్రమోద్‌, వంశీ, విక్కీ నా స్నేహితులు. ఈ సినిమాని జాగ్రత్తగా చేసుంటే... రూ.100 కోట్లు లాభం వచ్చేది. అంత లాభం వదులుకొని ఈ సినిమాని ఇంత భారీగా తీశారు. మనందరికీ అలాంటి స్నేహితులు ఉండాలి..


ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.. కేవలం ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. ఓ తెలుగు సినిమాను ఇంత భారీ స్థాయిలో నిర్మించడం అంటే మాటలు కాదు. అందులోనూ నిండా పాతికేళ్లులేని కుర్రవాడు డైరెక్టర్.. అంతకుముందు ఏ స్టార్ తోనూ ఆడైరెక్టర్ పని చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం.. ప్రభాస్ ను నమ్ముకుని 300 కోట్లు ఖర్చు చేయడమంటే మాటలు కాదు.


అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ప్రభాస్ కు బాహుబలి ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా ఈ సినిమా బిజినెస్ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఆ స్థాయిలో కలెక్షన్లు లేకపోతే నష్టపోయేది నిర్మాతలు కాదు.. డిస్ట్రిబ్యూటర్లే. అయితే బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా రూటే మారిపోయింది. ఇప్పుడు 300 కోట్ల బడ్జెట్ పెద్ద విషయంగా కనిపించకపోవడమూ విశేషమే. ఈ సినిమా బాహుబలిని మించిన సక్సస్ కావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: