తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ప్రతి శని, ఆదివారాల్లో అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ శనివారం ఆయన కొత్త కాన్సెప్ట్ తీసుకు వచ్చారు.  ముఖాలకు ముసుగు తీసి వేయాలని..ఇక నుంచి బిగ్ బాస్ లో జన్యూన్ గా ఉండాలని ఇంటి సభ్యులకు చెప్పారు.  వారి పర్ఫామెన్స్ కి తగ్గట్టుగా బహుమతులు కూడా ఇచ్చాడు.  ఇలా నాగార్జున ఆ రోజు యాంకర్ శివజ్యోతి (సావిత్రి) ని సేవ్ అయ్యిందని చెప్పారు.  ఇక నిన్న కోర్టు సీన్ క్రియేట్ చేసి ఇంట్లోంచి ఎవరు ఎందుకు వెళ్లిపోవాలి..కారణాలు చెప్పాలని టాస్క్ ఇచ్చారు.  అయితే జడ్జీలుగా వరుణ్ , శివజ్యోతి, అలీ లను నిర్ణయించారు.  వీరికి న్యాయం అనిపించింది ఫైనల్ గా ఎస్, నో అని చెప్పమన్నారు. బిగ్ బాస్ హౌజ్ లో నిన్న కూడా మంచి సందడి వాతారణం నెలకొంది. 

అందరూ ఎంతో ఉత్కంఠంగా చూసే ఎలిమినేషన్ రౌండ్ లో అనూహ్యంగా టివి నటి రోహిన్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  వాస్తవానికి ఈ వారం రోహిని ఎలిమినేషన్ రౌండ్ లో లేదు.  కానీ ఎలిమినేషన్ జరుగుతున్న సమయంలో శివజ్యోతి, రోహిని బాహాటంగా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవడం బిగ్ బాస్ కి కోపం తెప్పించింది.  దాంతో ఆమె ఈ వారం నేరుగా ఎలిమినేషర్ రౌండ్ లోకి వచ్చింది. 

ఇప్పటికే హేమ, జాఫర్,తమన్నా ఎలమినేషన్ కాగా నాలుగో వారం టివి నటి రోహిని ఎలిమినేషన్ అయ్యింది.  వాస్తవానికి రోహిని,శివజ్యోతి మద్య ఎవరు స్వయంగా ఎలిమినేషన్ అవుతారన్ని అడిగారు..అందుకు శివజ్యోతి నేనే అవుతానని చెప్పి రోహినిన సేవ్ చేసింది. కానీ అనుకోని పరిణామాల వల్ల ఇప్పుడు రోహిని ఎలిమినేషన్ కావడంతో శివజ్యోతి ఒక్కసారే ఎమోషన్ కి గురై వెక్కి వెక్కి ఏడ్చింది.  హౌస్ లో రోహిణి, శివజ్యోతిలు ఎంతో సన్నిహితంగా మెలిగారు. దీంతో రోహిణి ఎలిమినేట్ అయిందని తెలిసిన వెంటనే శివజ్యోతి వెక్కి వెక్కి ఏడ్చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: