ఈ ఏడాది ప్రారంభం లో పేట తో ప్రేక్షకులముందుకు వచ్చి హిట్ కొట్టాడు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఈ సినిమా తరువాత ప్రస్తుతం రజినీ నటిస్తున్న 'దర్బార్' ఇటీవల ముంబై లో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ జైపూర్ లో జరుగుతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బేబీ మనస్వి కొట్టాచి కూడా నటిస్తుంది. ఇంతకుముందు మనస్వి .. నయనతార నటించిన ఇమ్మైక నొడిగళ్ (అంజలి సి బి ఐ ) సినిమాలో నయన్ కు కూతురుగా నటించింది. ఈ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకుంది మనస్వి. ఇక ఇప్పుడు దర్బార్ లో నటిస్తుంది. ప్రస్తుతం మనస్వి కి సంబందించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ నివేతా థామస్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో పొంగల్ కు విడుదలకానుంది. కాగా మొదటి సారి రజినీ , మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న దర్బార్ ఫై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రజినీ కాంత్ , నయనతార కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరిద్దరూ చంద్రముఖి , కథానాయకుడు లో కలిసి నటించారు.