ఈ ఏడాది ప్రారంభం లో  పేట తో ప్రేక్షకులముందుకు వచ్చి హిట్  కొట్టాడు సూపర్ స్టార్ రజినీ కాంత్.  ఈ సినిమా తరువాత  ప్రస్తుతం రజినీ నటిస్తున్న 'దర్బార్' ఇటీవల ముంబై లో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఈ చిత్రం యొక్క  షూటింగ్  జైపూర్ లో జరుగుతుంది.  లేడీ సూపర్ స్టార్ నయనతార  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బేబీ  మనస్వి కొట్టాచి కూడా నటిస్తుంది.  ఇంతకుముందు  మనస్వి .. నయనతార నటించిన  ఇమ్మైక నొడిగళ్ (అంజలి సి బి ఐ ) సినిమాలో  నయన్ కు  కూతురుగా నటించింది. ఈ చిత్రంలో తన  నటనకు ప్రశంసలు అందుకుంది మనస్వి. ఇక ఇప్పుడు  దర్బార్  లో నటిస్తుంది.  ప్రస్తుతం మనస్వి కి సంబందించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 



 ఏఆర్ మురగదాస్  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  యంగ్ హీరోయిన్  నివేతా థామస్ ఓ  ముఖ్య పాత్రలో కనిపించనుంది.  యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.  ఇక వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్  అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.  లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాదిలో పొంగల్ కు విడుదలకానుంది. కాగా మొదటి సారి రజినీ , మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న దర్బార్ ఫై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇక రజినీ కాంత్ , నయనతార  కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరిద్దరూ చంద్రముఖి , కథానాయకుడు లో కలిసి నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: