బిగ్ బాస్ లో అందరూ మాస్క్ లు ధరించి సేఫ్ గేమ్ ఆడుతున్నారని, మాస్క్ లు తీసేసి తామేంటో చూపించాలని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. అయితే శనివారం ఈ విషయం గురించి చెప్పినా కూడా హౌస్ లో కొందరు ఇంకా మాస్క్ ని వేసుకున్నట్టే కనిపిస్తున్నారు.ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న వారి గురించి ఇంటి సభ్యల అభిప్రాయాలు చెప్పమన్నప్పుడు అందరూ వాళ్ళకి తోచిన విధంగా చెప్పారు.


అయితే అందరూ ఈ  మాత్రం ఈ విషయంలో అదరగొట్టినట్టే అనిపించారు. వాళ్ళ మాస్క్ లని తీసేసి ఉన్నది ఉన్నటుగా చెప్పినట్టు తెలుస్తుంది. ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రం ఏదో నామమాత్రంగా చెప్పమన్నారు కాబట్టి చెప్పాం అన్నట్టు బిహేవ్ చేసారు. అయితే మాస్క్ లు తీయకుండా ఉన్న ముగ్గురిలో మొదటగా పునర్నవి. పునర్నవి రాహుల్ గురించి సిల్లీ రీజన్స్ చెప్పింది. ఆమె చెప్పిన దానిలో ఏ కోశాన కూడా సీరియస్ నెస్ కనబడలేదు. 


ఇక హిమజ. శ్రీముఖి గురించి అసలే విషయమూ మాట్లాడలేదు. స్ట్రాటెజీ ప్లే చేస్తుందని చెప్పింది. కానీ బిగ్ బాస్ లో ప్రతీ ఒక్కరు స్ట్రాటజీ ప్లే చేస్తారు. మరి ఏ విధంగా అది మైనస్ అవుతుందో అర్థం కాలేదు. ఇక మిగిలింది ఆషు. రోహిణి కి ఆషు మంచి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆమె ఏం చెప్పలేకపోయింది. దేన్నీ సీరియస్ గా తీసుకోదు అనే ఒక విషయం తప్ప ఆమె చెప్పిన దానిలో ఏదీ సరైనది కాదనే వాదన వినిపిస్తోంది.


నాగార్జున మాస్క్ లు తీసేయండి అని చెప్పినా కూడా ఈ ముగ్గురు ఇంకా మాస్క్ లు ధరించినట్టే కనబడుతున్నారు. మరి ముందు ముందు ఎపిసోడ్లలో మాస్క్ లు తీసేస్తారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: