బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌ 'వీరే డీ వెడ్డింగ్‌' తర్వాత ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు తారలంతా సినిమాలతో పాటు డిజిటల్‌ మీడియాలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. అందులో చాలా మంది బాలీవుడ్‌ తారలు ఉన్నారు. ఆ జాబితాలో కరీనా కపూర్‌ ఖాన్‌ కూడా ఉండబోతుంది. ఇదే ఈమె తొలి డిజిటల్‌ ప్రాజెక్టు అయినా విభిన్నంగా ఉండేలా జాగ్రత్త పడింది. ఇప్పుడు వరకూ డిజిటల్‌ మీడియాలో నటిస్తున్న వారంతా ఏవో వస్తున్న కథలనే చేసుకుంటూ పోతున్నారు. కానీ కరీనా మాత్రం కొత్తగా ఆలోచించింది. చిట్‌ చాట్‌లా ఉండే ఓ వెబ్‌ షోను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సామాజిక అంశాలతో కూడిన షో చేస్తే బాగుంటుందని తన శ్రేయోభిలాషులంతా ఇదివరకే వివరించారట. ఆ కోణంలో వచ్చిన ప్రాజెక్టులనే కరీనా కూడా వింటోంది. ఓ దర్శకుడు చేసిన నరేషన్‌ మాత్రం ఆమెను మెప్పించిందట. త్వరలో ఈ వెబ్‌ చిట్‌ చాట్‌ షో ప్రారంభించబోతున్నారు. గత ఏడాది మహిళలు ఎదుర్కొన్న సమస్యలపై ఆమె రేడియో షో కూడా చేశారు. ఇప్పుడు కరీనా భర్త సైఫ్‌ అలీఖాన్‌ డిజిటల్‌ రంగంలో సక్సెస్‌ కావడంతో ఈమె కూడా అదే బాటలో రాణించాలని భావిస్తోంది.


భ‌ర్త  బాట‌లోనే వెళ్ళేందుకు సిద్ధ‌మైన ఈ భామ‌కి మ‌రి ల‌క్ ఏ విధంగా క‌లిసొస్తుందో చూడాలి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఒక్కోక్క‌రికి ఒక్కో ర‌క‌మైన ల‌క్ ఉంటుంది. అంద‌రికీ అన్నీ క‌లిసి రావాల‌ని లేదు అలా అని రాకూడ‌ద‌నీ లేదు.  త‌న భ‌ర్త సైఫ్ న‌టించిన స్కేర‌డ్ గేమ్స్ చిత్రం మూడు భాగాల‌లో న‌టించ‌గా అది అద్భ‌/త‌మైన  ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డమేకాక క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి హిట్‌ను సాధించాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని భ‌ర్త బాట‌లో న‌డ‌వ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం మంచి విశేష‌మే ఏది ఏమైనా భ‌విష్య‌త్తు అంతా డిజిట‌ల్ యుగ‌మేకాబ‌ట్టి ఈ డిజిట‌ల్ ప్రోగ్రాం కూడా మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: