సౌత్ లో కన్నడ లో తప్ప మిగితా అన్ని భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్. ఇక ఇప్పుడు ఆమె బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో 'బడాహీ హో' ఫేమ్ అమిత్ షా దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పింది కీర్తి. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ ఫుట్ బాల్ టీం మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'మైదాన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. జీ స్టూడియోస్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే కీర్తి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది.
ఇక కీర్తి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది. అందులో భాగంగా ఆమె ప్రస్తుతం నూతన దర్శకుడు నరేంద్ర డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంట్డ్ మూవీ లో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం స్పెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కు విడుదలకానుంది. ఈ సినిమాతోపాటూ కీర్తి 'ఇక్బాల్' ఫేమ్ నగేష్ కుకునూరు డైరెక్షన్లో ఓ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తుంది. ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి మరో లీడ్ రోల్ లో నటిస్తుండగా జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కాగా తమిళం లో ఇటీవలే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది కీర్తి సురేష్. పేట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.