టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  తన కొడుకు మొదటి సినిమాతో మంచి క్రేజ్ రావాలని పెద్ద దర్శకులు, స్టార్ హీరోయిన్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు బెల్లంకొండ సురేష్.  మాస్ దర్శకులు వివివినాయక్, స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇలా పెద్ద స్టార్లతో ఈ మూవీ తెరకెక్కింది. 


ఇక ఈ మూవీలో కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయంలో కనిపించిన విషయం తెలిసిందే.  మొత్తాని ఈ మూవీ మ్యూజికల్ పరంగా కూడా హిట్ అయ్యింది.  అయితే ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కి ఏ సినిమా కూడా కలిసి రాలేదు. పెద్ద నిర్మాతలతో తీసినా మనోడికి అదృష్టం కలిసి రావడం లేదు. ఈ మద్య రాక్షసుడు సినిమా కాస్త పరవాలేదు అనిపించింది. అంతే కాదు పెట్టిన పెట్టుబడి రాబట్టుకొని లాభాలు కూడా తెచ్చిపెట్టింది. 


తాజాగా ఇప్పుడు బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు సాయి గణేశ్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఓ మూవీలో నటించబోతున్నాడట. 


అయితే ఇది యాక్షన్ కమర్షియల్ మూవీగా కాకుండా ఓ మంచి లవ్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారట. అయితే . ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. దసరాకు ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేశ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: