సూపర్ స్టార్ మహేష్ తో సినిమా దర్శకులకు పెద్ద టాస్క్ అవుతుందా.. కథతో ఆయనను మెప్పించడమే కాకుండా మిగతా విషయాల పట్ల దర్శకులు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. ఈమధ్యనే మహేష్ బాబు హిట్టు వస్తేనే ఛాన్సులు ఇస్తాడంటూ పూరి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఆ మాట అనకుండా దాన్ని పొడిగించకుండా జాగ్రత్త పడ్డాడులేండి.  


ఆ మధ్య సుకుమార్ కూడా మహేష్ తో సినిమా కోసం ప్రయత్నించి ఆయన కోసం వెయిట్ చేయలేక బన్నితో సినిమా ఓకే చేసుకున్నాడు. ఇప్పుడు అదే క్రమంలో మరో దర్శకుడు కూడా మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా టైం వేస్ట్ అనుకున్నాడో ఏమో కాని ఆ సినిమా కుదరదని వేరే ప్రయత్నాల్లో ఉన్నాడట.


ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సందీప్ వంగ అని తెలుస్తుంది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సందీప్ వంగ హిందిలో ఆ సినిమానే కబీర్ సింగ్ అంటూ తీసి అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అసలైతే అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగ మహేష్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని మహేష్ టైం అడగడంతో వెళ్లి హింది అర్జున్ రెడ్డి చేసుకొచ్చాడు.  


బాలీవుడ్ లో కబీర్ సింగ్ సంచలన విజయం అందుకుంది కాబట్టి సందీప్ కు అక్కడ భారీ ఆఫర్లు వస్తున్నాయట. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సందీప్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సందీప్ కూడా మహేష్ సినిమాను పక్కన పెట్టి హింది సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మొత్తానికి మహేష్ మంచి దర్శకులను దూరం చేసుకుంటున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం అనీల్ రావిపుడితో సరిలేరు నీకెవ్వడు సినిమా చేస్తున్న మహేష్ మళ్లీ మహర్షి కాంబో రిపీట్ చేస్తాడని తెలుస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: