నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఆఖరి సినిమా 118. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకోవడమే కాకుండా కళ్యాణ్ రామ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలని అనుకుంటున్న నందమూరి ఫ్యాన్స్ కి ఫ్యామిలి సబ్జెక్ట్ ని ఎంచుకొని సర్‌ప్రైజ్ చేశాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత సతీష్ వేగేశ్న మళ్ళీ సినిమా ఇంత త్వరగా సెట్ చేసుకుంటాడనుకోలేదు. అందుకు కారణం శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్  అవడమే. అయినప్పటికి కళ్యాణ్ రామ్..సతీష్ వేగేశ్న కి ఛాన్స్ ఇచ్చాడంటే ఈ కథ మీద ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇక సంక్రాంతి అంటే బాబాయ్ బాలయ్య సినిమా పక్కాగా బరిలో ఉంటుందన్నది చాలా కాలంగా వస్తున్న ఆనవాయతీ. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ వుండేలా కనిపించడం లేదని తెలుస్తోంది. ముందుగా డిసెంబర్ లోనే కెఎస్ రవికుమార్ తో బాలయ్య చేసే సినిమా విడుదలవుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వుంది. ఇది నిజమే అనిపించేలా ఓ అనౌన్స్ మెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది.

నందమూరి కళ్యాణ్ రామ్-సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఫ్యామిలి బ్యాగ్డ్రాప్ లో వస్తున్న 'ఎంత మంచి వాడవురా' సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది. సంక్రాంతికి మహేష్ బాబు, బన్నీ సినిమాలు వున్నాయని తెలిసి ఈ సినిమా ప్రకటన ఇచ్చారు అంటే, దర్శక, నిర్మాతల ధీమా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే బాలయ్య సినిమా వుంటుందో, వుండదో తెలియకుండా ఈ ప్రకటన అయితే ఇవ్వరని లేటెస్ట్ న్యూస్. 

బాబాయ్ సినిమా లేదు అని కన్ ఫర్మ్ చేసుకున్నాకే ఈ ప్రకటన ఇచ్చి వుంటారని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటారు. మొత్తానికి సంక్రాంతికి ఎవరో ఒకరి, నందమూరి హీరోల సినిమా మాత్రం ఖచ్చితంగా వస్తోంది. అయితే ఏ డేట్ కి రిలీజ్ చేయనున్నారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. 10,11,12 మూడు తేదీల్లో మహేష్, బన్నీ, కళ్యాణ్ రామ్ ఎవరు ఏ డేట్ ని తమ సినిమా రిలీజ్ కి తీసుకుంటారో చూడాలి. ఇక ఈ మూడు సినిమాలతో పాటు సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న తమిళ్, తెలుగు సినిమా దర్బార్ కూడా 2020 సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: