సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. టీజర్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ను వచ్చే నెల 15 మరియు 16 తేదీలలో విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ మరియు చిరంజీవిల కాంబినేషన్ లో ఒక స్పెషల్ పోస్టర్ కూడా త్వరలోనే విడుదల కానుందట. కాగా సైరా టీమ్ భారీ ఎత్తున గొప్ప ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. మొత్తానికి ‘సైరా' కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది.
ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉన్న భారీ అంచనాలను మెగాస్టార్ ఎంతవరకు రీచ్ అవుతారో చూడాలి. అలాగే ఈ సినిమా తరువాత కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే వారంలో ఈ సినిమాలో చిరు లుక్ కి సంబంధించి లుక్ టెస్ట్ జరగనుందట. ఈ లుక్ టెస్ట్ ను బట్టే సినిమాలో మెగాస్టార్ గెటప్ ను డిసైడ్ చెయ్యాలని కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.