టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దొరసాని అనే సినిమా చేశాడు. రాజశేఖర్ – జీవిత కుమార్తె శివానీ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. విమర్శకుల ప్రశంసలు పొందినా ఆ సినిమా రెవెన్యూ పరంగా మాత్రం సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రాన్ని ఖరారు చేసాడు. నూతన దర్శకుడి కథను ఓకే చేసిన ఆనంద్ త్వరలోనే ఈ సినిమాను లైన్ లో పెట్టనున్నాడు. 



తమ్ముడి కోసం అన్నయ్యే రంగంలోకి దిగనున్నాడనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికరమైన విషయం. ఈ సినిమాను విజయ్ దేవరకొండ తన స్వీయ నిర్మాణంలో నిర్మించనున్నాడట. కింగ్ ఆఫ్ ద హిల్ బ్యానర్ ను స్థాపించి ఈ సంస్థ పేరు మీద తొలి వెంచర్ కు సిద్దమయ్యాడని సమాచారం. దొరసాని ఫ్లాప్ తో ఈసారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని సన్నద్ధమవుతున్నాడట ఆనంద్. టాలీవుడ్ హీరోలందరూ ఈమధ్య సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. ఇదే వరుసలో విజయ్ దేవరకొండ కూడా తనకంటూ ఓ బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తమ్ముడితో సినిమా తీసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఆనంద్ దేవరకొండ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేసేవాడు. అన్న సినిమాల్లో ఫేమస్ కావడంతో తాను కూడా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.



టాలీవుడ్ లో అతితక్కువ సమయంలో స్టార్ డం సాధించిన విజయ్ దేవరకొండ.. అతి తక్కువ సమయంలోనే నిర్మాణ రంగంలోకి రావడం స్వాగతించేదే. తమ్ముడిని ఎలాగైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలనేది అన్న కోరిక. మరి ఈ సినిమాతోనైనా ఆనంద్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: