అదేంటీ అలీపై మహేష్ బాబు సీరియస్ ఎందుకు అయ్యారా అని అనుకుంటున్నారా..అబ్బా కమెడియన్ అలీపై సూపర్ స్టార్ మహేష్ కాదు..   ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ 3 వస్తుంది.  ఇందులో ఇంటి సభ్యులు అలీ వర్సెస్ మహేష్ ల మద్య నిన్నటి ఎపిసోడ్ లో వివాదం చోటు చేసుకుంది.  ఈ సందర్భంగా నువ్వా అంటే నువ్వా అనుకున్నారు.  బాబా భాస్కర్ ని ఎందుకు ఎలిమినేట్ చేశాన్న విషయం పై ఇంటి సభ్యులకు అలీ వివరిస్తుంటే మద్యలో మహేష్ జోక్యం చేసుకోవడంతో అలీ సీరియస్ అయ్యాడు. 

దాందో ఇద్దరి మద్య గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ.. ఒకరి మీదకు మరొకరు కొట్టుకోవడానికి వెళ్లేలా ప్రవర్తించడంతో సిట్యుయేషన్ సీరియస్ అయిపోయింది. మహేష్, అలీలను బాబా భాస్కర్, వరుణ్‌లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెట్టుకున్నారు.

మాట్లాడితే పుల్లలు పెడుతున్నా.. అని అంటున్నారు? నా వల్ల హౌస్‌లో ఎవరైనా కొట్టుకున్నారా? అసలు నన్ను అనడానికి నువ్ ఎవడివి? నేను నీ ఇంటికి రాలేదు.. బిగ్ బాస్ ఇంటికి వచ్చా.. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు దెబ్బలు తింటావ్'' అంటూ అలీకి వార్నింగ్ ఇచ్చాడు మహేష్. తర్వాత కెప్టెన్ టాస్క్ ఇచ్చారు.  కంటిస్టెంట్ రూమ్ లో కుర్చీపై ఎవరు ముందుగా కూర్చుంటారో వారు కెప్టెన్ పోటీలో ఉంటారని. దాంతో శివజ్యోతి, వితికలు ముందుగా కూర్చోవడంతో కెప్టెన్ టాస్క్ లో నెగ్గారు. దాంతో ఇద్దరి మద్య టాస్క్ ఒక తాడు తో స్విమ్మింగ్ ఫూల్ పై వేలాడదీసి ఎవరు ముందుగా స్విమ్మింగ్ పూల్ లో కాలు మోపుతారో వారు ఓడిపోయినట్లు.. అయితే చాలా సేపటి వరకు ఉన్న రితిక తట్టుకోలేక పోయి కాళ్లు స్విమ్మింగ్ ఫూల్ లో పెట్టేసింది.  దాంతో శివజ్యోతి ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: