మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టీజర్ నీ ముంబై వేదికగా తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి తన కెరీర్లో ఇటువంటి సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదని కానీ నా కొడుకు చెర్రీ నా చేత ఈ సినిమా చేయించడం చాలా గర్వ కారణం గా ఉందని చరణ్ నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను అని చిరంజీవి పేర్కొన్నారు.


తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయిన నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది తమ అభిప్రాయాలను తెలియజేస్తే చిరంజీవి పై పొగడ్తల వర్షం కురిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులు వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, నీహారిక, కళ్యాణ్ దేవ్, ఉపాసన ఇలా అందరూ తమ ట్విట్టర్ అకౌంట్లలో టీజర్ ని షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలావుండగా అల్లు ఫ్యామిలీ నుండి రెస్పాండ్ ఒక్కటి కూడా రాకపోవటం మెగా అభిమానుల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.


అల్లు  కుటుంబానికి సంబంధించి అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, స్నేహా రెడ్డి వీరెవరూ కూడా సినిమా టీజర్ పై ఒక్క ట్వీట్ కానీ పోస్ట్ కానీ చేయలేదు. అల్లు అర్జున్ తప్పించి మిగిలిన వారంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అన్ని విషయాలపై స్పందించే వీరు చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన 'సై రా' సినిమా టీజర్ విడుదలైతే ఒక్క కామెంట్ కూడా చేయలేదు దీంతో మెగా అభిమానులు అల్లు బ్రదర్స్ పై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కూడా ఇలా వ్యవహరించడం పట్ల అల్లు బ్రదర్స్ విషయం ఇండస్ట్రీలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: