మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అనేక సినిమాలు చేశారు.  మూడు దశాబ్దాలపాటు టాప్ హీరోగా నిలిచాడు.  ఎన్నో రివార్డులు, అవార్డులు గెలుచుకున్నారు.  అయితే, 2007 నుంచి 2014 వరకు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసందే.  ఏడేళ్ల గ్యాప్ తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్లోకి రి ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ప్రస్తుతం ఈ స్టార్ హీరో సైరా చేస్తున్నారు.  ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.  ఆగస్టు 14 వ తేదీన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో చూపించారు.  


ఆగష్టు 20 వ తేదీన టీజర్ రిలీజ్ చేసి... సినిమా ఎలా ఉండబోతున్నదో చూపించారు.  విజువల్ పరంగా టీజర్ ఆకట్టుకుంది.  వార్ సీన్స్ గూస్ బమ్స్ అని చెప్పొచ్చు.  60 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ అద్భుతంగా నటించారు.  ఇక్కడ విషయం ఏంటి అంటే.. మెగాస్టార్ డూప్ లేకుండా నటించారు.  డూప్ లేకుండా నటించడం అంటే మాములు విషయం కాదు.  వార్ సీన్స్, గుర్రం స్వారీకోసం మెగాస్టార్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.  ఎన్నో రిహార్సిల్స్ చేసుకున్నాకే షూటింగ్ వెళ్లారట.  


పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాను బాలీవుడ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.  గతంలో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మెగాస్టార్ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయ్యింది. అప్పట్లో అజ్ కా గూండారాజ్, ప్రతిబంద్, జెంటిల్మెన్ వంటి బాలీవుడ్ సినిమాలు చేశారు.  ఈ మూడు మంచి హిట్ కొట్టాయి.  1994లో అయన నటించిన జెంటిల్మెన్ సినిమా బాలీవుడ్లో రిలీజ్ అయ్యింది.  ఆ తరువాత అక్కడ వరసగా సినిమాలు చేస్తారేమో అనుకున్నారు. 


కానీ, మెగాస్టార్ ఆ తరువాత బాలీవుడ్ వైపు చూడలేదు.  ఎందుకు ఏంటి అనే విషయం తెలియదు.  మంచి కథ దొరకలేదని అనుకోవడం తప్ప ఏం చేయలేము కదా.  ఇన్నాళ్లకు మరలా సైరా మూవీతో మెగాస్టార్ తిరిగి బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు.  సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  టీజర్ అక్కడి ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. 25 ఏళ్ల తరువాత మెగాస్టార్ తిరిగి బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు కాబట్టి సినిమా తప్పకుండా హిట్ కావాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: