విలక్షణ  దర్శకుడు  గౌతమ్ మీనన్, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కిన  చిత్రం 'ఎన్నై నోకి పాయుమ్ తొట్ట'.  ఎప్పుడో  విడుదల కావాల్సిన  ఈ చిత్రం  ఆర్థిక సమస్యల కారణాల వల్ల  వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు  ఈ సినిమా  విడుదలకు  అన్ని అడ్డంకులు  తొలిగిపోయాయి. అన్ని  కుదిరితే  సెప్టెంబర్ 6న ఈ చిత్రం  విడుదలకానుందని సమాచారం.  తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రాన్ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదలచేయనుంది. 




శివ సంగీతం అందించిన  ఈచిత్రంలో  మెగా ఆకాష్ కథానాయికగా నటించిన శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఈచిత్రానికి  గౌతమ్ మీనన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా  విడుదలకు  లైన్ క్లియర్ అయ్యింది కానీ   గౌతమ్ మీనన్  దర్శకత్వంలో   తెరకెక్కిన 'ధ్రువ నక్షత్రం' మాత్రం  ఇంకా నిర్మాణంలోనే వుంది. ఈసినిమా  కూడా ఎప్పుడో విడుదలకావాల్సి వుంది కానీ ఆర్థిక సమస్యల వల్ల ఈ చిత్రాన్ని  పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఈ సినిమాను కూడా గౌతమ్ మీనన్ ఎలాగోలా విడుదల చేసేలా చూస్తాడో లేక వదిలిపెట్టేస్తాడో చూడాలి.   





ఇక ధనుష్ ప్రస్తుతం  వరుస సినిమాలతో  బిజీగా వున్నాడు. అందులో భాగంగా ఇటీవల  వెట్రి మారన్  దర్శకత్వంలో 'అసురన్' అనే చిత్రాన్ని పూర్తి చేశాడు.   ఈ చిత్రంలో  ధనుష్  డ్యూయెల్ రోల్ లో నటిస్తుండగా మలయాళ  నటి మంజు వారియర్  ఓ హీరోయిన్ గా  నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ ప్రస్తుతం  దొరై సెంథిల్ కుమార్  డైరెక్షన్ లో  పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం ప్రారంభం కాగా  పంజాబీ బ్యూటీ మెహ్రీన్ ,ధనుష్ కు జోడిగా నటిస్తుంది. కాగా  టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర ఈ చిత్రంలో విలన్ పాత్రలో  కనిపించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: