కోలీవుడ్ హీరో విశాల్ హైదరబాద్ బిజినెస్ మ్యాన్ కూతురు అనీషాతో మార్చి 10న నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. విశాల్, అనీషాల ప్రేమకు ఇరు కుటుంబ పెద్దలు అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. త్వరలో పెళ్లి డేట్ ఎనౌన్స్ చేస్తారని అనుకోగా ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నట్టు తెలుస్తుంది.  


నిశ్చితార్ధం తర్వాత విశాల్ అనీషాలు టర్కీ వెళ్లొచ్చారు. వెళ్లొచ్చిన దగ్గర నుండి విశాల్, అనీషాలు కలవడం మానేశారట. ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తుంది. దాదాపుగా పెళ్లి క్యాన్సిల్ చేసుకునే దాకా వీరి గొడవ వెళ్లిందట. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెళ్లి ఆపేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్.  


కోలీవుడ్ హీరో విశాల్ కు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. నిర్మాతల మండలి గొడవలో అతన్ని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. నడిగర్ సంఘం ఎలక్షన్స్ టైంలో కూడా విశాల్ మీద తమిళ నటులు కొందరు నెగటివ్ కామెంట్స్ చేశారు. ఇవే విశాల్ కు అనీషాకు మధ్య గొడవలకు దారి తీశాయని తెలుస్తుంది.  


విశాల్, అనీషా పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా లేదా అన్న విషయంపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే ఏది బయటకు రాలేదు. ఎప్పుడు ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లో యాక్టివ్ గా ఉండే అనీషా రెడ్డి విశాల్ తో తన ఎంగేజ్మెంట్ పిక్స్ ను డిలీట్ చేసింది. విశాల్ తో పెళ్లి వద్దనుకుంది కాబట్టే అనీషా ఇలా చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లో కూడా అక్కినేని అఖిల్ తన చిన్ననాటి స్నేహితురాలు శ్రీయ భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. విశాల్ విషయంలో కూడా అదే జరుగుతుందేమో చూడాలి.   
  


మరింత సమాచారం తెలుసుకోండి: