బిగ్ బాస్ లో బుధవారం జరిగిన టాస్క్ లో జడ్జిగా వ్యవహరించిన బాబా భాస్కర్, శ్రీముఖిలలో ఎవరు తమ్ బెస్ట్ ఇచ్చారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. షో చూసిన వాళ్ళెవరికైనా జడ్జిగా ఎవరు సరిగ్గా చేశారనేది ఇట్టే తెలిసిపోతుంది. బుధవారం జరిగిన ఎపిసోడ్ లో జడ్జిగా వ్యవహరించిన శ్రీముఖి కొన్ని పొరపాట్లను చేసింది. జడ్జిగా ఆమె అందరినీ సమానంగా చూడలేదనే వాదన వినిపిస్తోంది. అయితే జడ్జిగా శ్రీముఖి విఫలమైందనే చెప్పవచ్చు.


బిగ్ బాస్ లో శ్రీముఖి కి ఇతర కంటెస్టెంట్ లతో తనకున్న స్నేహం దృష్ట్యా వారికి ఎక్కువ సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె మూడు విషయాల్లో పొరపాటు చేసింది.మొదటగా రాహుల్ విషయంలో ఆమె ఆప్పీ ఫిజ్ ఇవ్వడం. అతను బానే పాడినప్పటికీ, పేపరు చూసి పాడాడన్న విషయం ఎక్కువగా పట్టించుకోకుండా బెస్ట్ పర్ ఫార్మార్ గా ఫిజ్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.


ఇక రెండోది,  ఆలీ డాన్స్ చేస్తిన్నప్పుడు జడ్జిగా ఉన్న శ్రీముఖి అతనికి సూచనలు ఇవ్వడం. అప్పటి వరకు ఎవరికి ఎలాంటి సూచనలు చేయకుండా ఆలీ రాగానే, స్విమ్మింగ్ పూల్ లో దూకమని చెప్పడం బాలేదని వాదిస్తున్నారు.జడ్జి సీట్ లో కూర్చుని ఒకరికి సపోర్ట్ చేయడం అనేది తప్పు. అదీ గాక జడ్జిగా ఆమె కొందరి విషయంలో పక్షపాతం చూపించిందని తెలుస్తుంది. ముఖ్యంగా  అందరికంటే విభిన్నంగా ప్రయత్నించిన మహేష్ కి సరైన కామెంట్స్ ఇవ్వలేదు.


దీనికి కారణం ఆమె మహేష్ తో స్నేహం వద్దనుకుకోవడమే! టాలెంట్ అంటే డాన్స్ చేయడం, పాటలు పాడడం మాత్రమే కాదు కదా! మరి మహేష్ చేసిన దాన్ని  ఆమె ఎందుకు సరిగ్గా గుర్తించలేకపోయింది. ఈ మూడు పొరపాట్లు చేయకుండా ఉంటే మరింత బాగుండేదని అంటున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: