మెగా కాంపౌండ్ హీరో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గతంలో చిత్రలహరి సినిమా రాకముందు ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడ్డారు సాయి ధరంతేజ్ అప్పట్లో చిరంజీవి పాత సినిమాల కు సంబంధించిన పాటలు రీమేక్ చేస్తూ అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. అయితే చిరంజీవి సినిమాకు సంబంధించి పాటలు రీమేక్ సినిమాలు అన్ని ఫ్లాప్ అయితే ఆ పాటలకు ఫుల్ స్టాప్ పెట్టి చిత్ర లహరి సినిమా సాయి ధరమ్ తేజ్ చేసిన వెంటనే హిట్ పడటం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.


అయితే చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా హిట్ అందుకోవడంతో సాయి ధరమ్ తేజ్ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యలో చాలా మంది డైరెక్టర్లు కథలు చెప్పిన నిర్మొహమాటంగా నో చెప్పి కుదిరితే స్టోరీ మార్చి తీసుకురమ్మని  చెబుతున్నాడట. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్నా...ధరంతేజ్ కోలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన తమిళ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


వివరాల్లోకి వెళితే అజిత్ గ్యాబ్లర్ - సూర్య మాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు చెప్పిన స్క్రిప్ట్ సాయికి నచ్చినట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్ కూడా సినిమాను తెరకెక్కించే ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరో మూడు సినిమాలు ఇంకా వెయిటింగ్ లిస్టులో పెట్టాడట. అంతేకాకుండా వీరుపోట్ల - దేవకట్ట లతో కూడా ఈ మెగా హీరో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద మొట్టమొదటిసారి సాయి ధరమ్ తేజ్ కి హిట్టు రావడంతో స్టోరీలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: