టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’లో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డె.  ఈ మూవీ లో ఆమె పాత్రకు తగ్గట్టు అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించింది.  ఇక అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాలో నైనా గ్లామర్ షో ఛాన్స్ దొరుకుతుందనుకున్న ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది.  ఈ మూవీలో కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది.  దాంతో తెలుగులో రాణిద్దామనుకున్న పూజా హెడ్గే ఆశలు నిరాశలే అయ్యాయి. 

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’సినిమాలో మంచి చాన్సు దక్కించుకుంది.  ఈ మూవీలో తన అందాలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా బ్లాక్ బికినీ లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఒక్క సినిమా పూజా హెడ్గే కెరీర్ నే మార్చేసింది. ఈ మూవీ తర్వాత తెలుగు లో వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  మహేష్,ఎన్టీఆర్,ప్రభాస్ ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. తనకు వస్తున్న అన్ని ప్రాజెక్టులు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ కెరీర్ సాఫీగా కొనసాగిస్తుంది.

కథ చెప్పడానికి ముందే దర్శకులు ఎవరైనా సరే షూటింగ్ కి ఒక రోజు ముందే డైలాగ్స్ స్క్రిప్ట్ తనకు ఇవ్వాలని చెబుతోందట. ఎందుకంటే సెట్స్ లో తాను ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముందే ప్లాన్ వేస్తుంది. ఈ కండీషన్స్ కి ఓకే అంటేనే ఎంత పెద్ద బ్యానర్ అయినా ఓకే అంటుందట. అందుకు కారణం తనకు తెలుగంటే చాలా ఇష్టమని వీలైనంత త్వరగా తెలుగు భాషను నేర్చుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది. తాజాగా పూజా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆల వైకుంఠపురములో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: