బాలీవుడ్ మీడియా ఒక సెలెబ్రెటీ పై గాసిప్పులు ప్రచారానికి దిగింది అంటే దాని వెనుక ఎదో బలమైన కారణం ఉంటుంది. ‘సైరా’ మూవీని నిర్మించి బాలీవుడ్ లో ఈ మూవీని చరణ్ ఈమధ్య బాగా ప్రమోట్ చేస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ మీడియా దృష్టి చరణ్ పై బాగా ఎక్కువగా పెట్టి చరణ్ ను టార్గెట్ చేస్తూ వార్తలు సృష్టిస్తోంది. 

ఈ నేపధ్యంలో గత కొద్ది కాలంగా చరణ్ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానిల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తున్న వార్తలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ‘సైరా’ పనుల కోసం ఈమధ్య తరుచు ముంబాయి వెళుతున్న నేపధ్యంలో కొన్ని రోజుల క్రితం చరణ్ కియారా అద్వానిలు ఒక రెస్టారెంట్ లో ఏకాంతంగా కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇప్పుడు ఈ ఫోటోల పై బాలీవుడ్ మీడియా రచ్చ చేస్తోంది. కియారా అద్వాని సిద్దార్ధ మల్ హోత్రతో డేటింగ్ చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు చరణ్ అంత ఏకాంతంగా కలుసుకోవలసిన అవసరం ఏమిటి అంటూ బాలీవుడ్ మీడియా గాసిప్పులు వ్రాస్తోంది. అయితే ఈ గాసిప్పుల పై చరణ్ సన్నిహితులు వేరే విధంగా స్పందిస్తున్నారు. 

‘వినయ విధేయ రామ’ మూవీలో చరణ్ కియారా అద్వానిలు కలిసి నటించినప్పటి నుండి వారి స్నేహం కొనసాగుతోందని ఈ విషయాన్ని నెగిటివ్ కోణంలో బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది అంటూ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మరికొందరైతే ‘వినయ విధేయ రామ’ తరువాత కియారా కు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో చరణ్ తో తనకు ఉన్న స్నేహాన్ని ఆసరాగా చేసుకుని కియారా ఇలా చరణ్ ను టాలీవుడ్ లో అవకాశాల కోసం కాకా పడుతోంది అంటూ వీరిద్దరి మధ్య పెరుగుతున్న స్నేహం పై అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: