2018 సంవత్సరంలో విడుదలైన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత అల్లు అర్జున్ సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కు చాలా మంది దర్శకులు కథలు చెప్పారు. కానీ అల్లు అర్జున్ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపే మొగ్గు చూపాడు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. 
 
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా, దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికయినట్లు సమాచారం అందుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలోని సినిమాకు మాత్రం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అల్లు అర్జున్ కు జోడీగా మొదట అలియా భట్ ను సంప్రదించాడు నిర్మాత దిల్ రాజు. అలియా భట్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది. కానీ అలియా భట్ సినిమాలో నటించటానికి ఒప్పుకోలేదు. అలియా భట్ ఒప్పుకోకపోవటంతో దిల్ రాజు దిశా పటానీని సంప్రదించినట్లు తెలుస్తుంది. దిశా పటానీ సినిమాలో నటించటానికి 4 కోట్ల రుపాయల రెమ్యునరేషన్ అడిగినట్లు సమాచారం. 
 
బన్నీ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కావాలని భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కోసం నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. మరి 4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి దిశా పటానీనే తీసుకుంటారో లేక వేరే హీరోయిన్ ఎవరినైనా సంప్రదిస్తారో తెలియాల్సి ఉంది. సాహో సినిమాకు హిట్ టాక్ వస్తే అల్లు అర్జున్ కు జోడీగా శ్రధ్ధా కపూర్ ను కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: