టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి "అల వైకుంఠపురములో" అనే క్లాసిక్ టైటిల్ ని పెట్టారు. సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఎలాగైనా సంక్రాంతి బరిలో ఉండాలనే ఉద్దేశ్యంతో మునుపటి కంటే వేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది.


నా పేరు సూర్య డిజాస్టర్ తర్వాత సినిమాని ఒప్పుకోవడం లో ఆలస్యం చేసిన బన్నీ ఒకేసారి మూడు కథల్ని ఎంచుకున్నాడు. వచ్చే ఏడాది తన నుండి మూడు సినిమాలు రిలీజ్ అవుతాయని టాక్. త్రివిక్రమ్ అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడట. దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎటువంటి సమాచారం రాలేదు. ఈ సినిమాకి సంబంధించి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే మరో డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో "ఐకాన్" కనబడుటలేదు అనే సినిమాని చెయ్యబోతున్నాడు.


ఐకాన్ సినిమా లో బాలీవుడ్ భామ దిశా పటానీని హీరోయిన్ గా ఎంపిక చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ తర్వాత వేణు శ్రీరామ్ తోనే సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. హిందీలో డబ్ అయిన సినిమాలకి యూట్యూబ్ లో ఉన్న వ్యూస్ చూస్తే ఈ విషయం తెలుసుకోవచ్చు.


సరైనోడు  200 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఒక సౌత్ హీరో సినిమాకు అన్ని వ్యూస్ రావడం అంటే చిన్న విషయం కాదు.దీనితో హిందీ ఆడియెన్స్ కు బన్నీ బాగా దగ్గరయ్యారు. మరి బాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: