‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.330 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం,మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్.. అండర్ కవర్ కాప్‌గా నటించబోతున్నట్టు సమాచారం. అయితే రోజులో అప్‌డేట్ అప్‌డేట్‌తో వార్త‌ల్లో నిలుస్తున్న సాహో చిత్రానికి కొత్త అప్‌డేట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ ద్వాపాత్రాభిన‌యంలో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎటువంటి అధికార ప్ర‌క‌టన రాలేదు. ఈ వార్త నిజ‌మే అయితే క‌నుక ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ ఇచ్చిన‌ట్లే. 


అంతేకాదు ఆయన క్యారెక్టర్ పేరు అశోక చక్రవర్తి అని వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమాలో ప్రభాస్.. రెండు పాత్రల్లో డ్యూయల్ రోల్లో అద‌ర‌గొడ‌తార‌ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో వాస్తమెంతో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్యపాత్రల్లో జాకీ ఫ్రాఫ్,నీత్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే,మందిరా బేడి,అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.


ఇదిలా ఉంటే ఆగ‌స్ట్ 30న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం పెద్ద చిత్రాల ఖాతాలోకి వ‌స్తుంది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తొలివారంలో టిక్కెట్ రేట్లను పెంచడం.. దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టిక్కెట్ల రేటును పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు. ప్రభాస్‌కి బాహుబలి టైంలో కూడా అదనపు షోతో పాటు టిక్కెట్ రేటు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు జగన్‌ కూడా ప్రభాస్‌కి టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలకు బంబర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ పెరిగిన రేట్లు నిర్మాతలకు లాభం కాగా.. ప్రేక్షకులు జేబులకు చిల్లుపెట్టడమే. తొలివారంలో సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు అదనపు భారం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: