తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 దిగ్విజయంగా 5 వారాల పూర్తి చేసుకుని ఆరవ వారంలో కి ఎంటర్ అయ్యింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు జరిగిన ఎపిసోడ్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన యాంకర్ నాగార్జున టీవీ ద్వారా హౌస్ లో ఉన్న సభ్యులను పలకరించారు. దీంతో నాగార్జున ఇంటి సభ్యులను కొద్దిసేపు జోకులు వేసి మరీ నవ్వించారు. ఒకవైపు ఇంటి సభ్యులకు టస్కులు ఇచ్చి ఆటాడిస్తూ...మరొకవైపు ఎలిమినేషన్ లో నామినేట్ అయిన ఐదుగురు సభ్యులను ఒక్కొక్కరిని సేఫ్ జోన్ లోకి ప్రకటిస్తూ ఆదివారం జరిగిన ఎపిసోడ్ నీ రక్తికట్టించారు.


హౌస్ మేట్స్ ఒకరి క్యారెక్టర్‌ను మరొకరు ప్లే చేస్తుండడంతో మంచి ఎంటర్టైన్మెంట్ పండించారు. వరుణ్‌ సందేశ్‌ పునర్నవిలా.. పునర్నవి వరుణ్‌సందేశ్‌లా, రాహుల్‌లా శ్రీముఖి నటించి బాగా నవ్వించారు. మధ్యమధ్యలో సేఫ్ జోన్ లో ఎవరెవరు ఉన్నారో అనౌన్స్ చేసిన నాగ్ ఫైనల్ గా అషురెడ్డి ఎలిమినేటెడ్ అని ప్రకటించారు. హౌస్ నుండి వెళ్లిపోతూ జిగేలు రాణి పాటకు స్టెప్పులు వేసింది అషు రెడ్డి. ఆ తరువాత స్టేజ్ మీదకు వచ్చిన అషుకి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు.


కంటెస్టెంట్స్ అందరి అందరి ఫ్రేమ్ లు ఒక బోర్డ్ మీద పెట్టిన నాగ్ హౌస్ లో ఎవరుంటారని భావిస్తున్నావని అషుని అడగగా శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్, రవికృష్ణల ఫ్రేమ్ లను మాత్రమే ఉంచి మిగిలిన వాళ్ల ఫ్రేమ్ లను పగలగొట్టింది. మొత్తంమీద చూసుకుంటే షో లో రోజులు దగ్గర పడుతున్న తరుణంలో ఇంటిలో వాతావరణం రోజు రోజుకి మారిపోతుంది. ఎవరికి వారు విజయం కోసం తమ ఒరిజినల్ క్యారెక్టర్లను బయట పెట్టేస్తున్నారు. దీంతో ఈ షో చూస్తున్న ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: