
3months ago [IST]
లాంచనం ముగిసింది... వైసీపీ వేట మొదలైంది..
ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీమమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యారు. వైసీపీకి అసెంబ్లీలో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో మూడు సీట్లు ఆ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి. ఇక టీడీపీ కనీసం అభ్యర్థిని పోటీ పెట్టేందుకు కూడా సాహసించని పరిస్థితి. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. దీంతో లాంచనం ముగిసినట్లయ్యింది. ఇక ఐదేళ్ల పాటు ఇటు ఎమ్మెల్సీలతో పాటు అటు రాజ్యసభ ఎన్నికల్లోనూ అన్ని సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఈ ఐదేళ్లలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే వైసీపీ పదవుల వేట ఈ మూడు ఎమ్మెల్సీలతో ప్రారంభించినట్లయ్యింది.
ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీల్లో హిందూపురం వైసీపీ ఇన్చార్జ్ మహ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. జగన్ ఎన్నికల ప్రచారంలో చాలా మందికి ఎమ్మెల్సీలు ఇస్తానని హామీ ఇచ్చినా తొలి విడతలో సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని ఈ ముగ్గురుకి మాత్రమే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు.
ఈ ముగ్గురిలో కూడా రెడ్డి వర్గం నుంచి రామకృష్ణారెడ్డి, మైనార్టీ వర్గం నుంచి ఇక్బాల్, బీసీ కోటాలో మంత్రి మోపిదేవికి పదవులు వచ్చాయి.
ఇక మరో 15 మంది నేతల వరకు ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. వీరిలో చాలా మందికి జగన్ నుంచి బహిరంగంగా హామీ కూడా వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రివర్గంలో కొత్తవారికి చోటు కల్పించనున్న నేపథ్యంలో తర్వాత విడతలో మర్రి రాజశేఖర్ లాంటి వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఇక తెలంగాణలో ఎన్నిక జరిగిన ఏకైక ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్కు చెందిన సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు.
మీ ఆదరణకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తమరు చదివిన ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే వాట్సాప్ లో షేర్ చేయండి.
కామెంట్స్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను తీసివేసేందుకు మాకు సహకరించండి. వాటిని అభ్యంతరకరమైనవిగా గుర్తించండి. - ఇండియా హెరాల్డ్ గ్రూప్
-
Top Selling Wireless SpeakersSave up to to 50% on top brands
See Now
-
The Electronics StoreInstant Discount
Shop Now
-
Air Conditioners2019 Launches
Check Now
-
OPPO A9 (2020)Starting at 15,990/-
Shop Now
-
Top Rated Home AudioImmersive Audio Experience
Check Out
-
Best Selling TVsUp to 45% OFF
Buy Now
-
PC AccessoriesGreat Prices
Shop Now
-
Amazon DevicesExtra Savings
Buy Now
-
Best LaptopsInstant Discount
Check Now
-
Laptops for Every NeedTop Brands
Shop Now
-
Deals on Smart TVsCheck Best Offers
Check Out
-
RefrigeratorsLowest Prices
Buy Now
-
Choose the right printerBest Offers
Shop Now
-
Black Friday Sale29th Nov- 2nd Dec
Check Now
-
Best Mobile AccessoriesInstant Discount
Buy Now
-
Wireless HeadphonesLatest range
Check Now
-
Offers on DSLR CamerasUp to 20% off
Buy Now
-
Mi TVsExtra Savings
Buy Now
-
Best Selling LaptopsInstant Discount
Shop Now
-
Air ConditionersUp to 40% OFF
Buy Now
-
Latest Alexa DevicesNew Alexa Devices
Explore