ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ప్రియా స్నేహితురాలు సాధినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పేందుకే సిద్ధంగా ఉన్నట్టు వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. టీడీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు అని వార్తలు వస్తున్నాయి.              


ఆమె పార్టీ మారుతార లేదా అనేది ఇంకా ప్రశ్నార్ధకం అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలపై వచ్చే కొన్ని కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. అంత హల్ చల్ చేసే కామెంట్లు ఏంటంటే .. యామిని , లోకేష్ ను ఉదేశిస్తూ 'అయ్యో లోకేష్ బాబుని వొదిలేసి వెళ్ళిపోతున్నావా యామిని అక్క' అని ఒకరు కామెంట్ చేస్తే మరికొందరు 'హమ్మయ్య మంచి పని చేస్తున్నావ్' అని అంటున్నారు. 


మరికొందరు కామెంట్ చేస్తూ 'ఏది ఏమైనా సాదినేని యామిని చాల తెలివైనది అబ్బా ..!  అప్పుడే పప్పు లోకాన్ని ఒదిలి వెళ్ళిపోతుంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సాధినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పడం పక్కన పెడితే .. తెలుగు దేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నారు. 


రాజకీయ భవిష్యేత్తు కోసం టీడీపీ నాయకులూ పార్టీ మారుతున్నారు. మరికొందరు నాయకులూ వారసత్వం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని బీజేపీలోకి చేరుతున్నారు. ఇదే బాటలో సాదినేని యామిని కూడా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈమె కూడా త్వరలో కమలం గూటికి చేరనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: