బుద్ధా వెంకన్న ఇతని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్య కాలంలో కేశినేని నాని వల్ల మరి ఫేమస్ అయిపోయారు వెంకన్న. ఇతను ఎమ్మెల్సీ అయినప్పటికీ కేశినేని నాని ట్విట్ చేస్తే కానీ ఇతని గురించి ఎవరికి తెలీలేదు. అంతగా కేశినేని నాని ఎం చేసారంటే గత నెల మొదటి ఆదివారం నాడు కేశినేని నాని, బుద్ధా వెంకన్న చేసిన ట్విట్ వార్ ఏ దీనికి నిదర్శనం. 


నలుగు పదాలు రానివాడు కూడా ట్విట్ చేసేస్తున్నాడు అని కేశినేని నాని యుద్ధం మొదలు పెట్టడం వల్ల బుద్ధా వెంకన్న ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. దీంతో అప్పటి నుండి బుద్ధా వెంకన్న చేసే వ్యాఖ్యలు ప్రతి వెబ్ సైట్ లో అతని వార్తలు ప్రత్యేకంగా మొదటి స్థానంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుద్ధా వెంకన్న అంటారో సంచలన వ్యాఖ్య చేశారు. 


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హతమార్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి‌ వచ్చాక చంద్రబాబుకు భద్రత తగ్గించారని, భద్రత పెంచాలని హైకోర్టు చెప్పినా బేఖాతరు చేశారన్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఇంటిపై డ్రోన్‌తో అడుగడుగున విజువల్స్ కావాలనే తీశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును‌ హతమార్చే కుట్రలో భాగంగానే.. డ్రోన్‌తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ మంత్రులే ఈ పనులు చేస్తున్నారని అతనికి అనుమానంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 


వైసీపీ చేసే కుట్రలను భగ్నం ‌చేయడానికి పోరాటం చేస్తానని, చంద్రబాబును‌ రక్షించుకోవడం కోసం.. 'అవసరమైతే జగన్ ఇంటి ముందు ఆత్మహత్య ‌చేసుకుంటా' అని సంచలన వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య విన్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తున్నారు. 'మీ ఇష్టం వెంకన్న.. మీరు ఆ పని చేస్తా అంటే మేము వద్దంటామా' అని ఒకరు అంటే.. మరొకరు స్పందిస్తూ 'కావాలంటే పప్పు నాయుడుని కూడా తీసుకెళ్లండి.. ' అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ ' కేశినేని నాని వ్యాఖ్యలు నిజమే వెంకన్న.. నాలుగు పదాలు రానివాడు కూడా అధిష్టానాన్ని బెదిరించాడనికి ప్రయత్నిస్తున్నాడు' అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.    


మరింత సమాచారం తెలుసుకోండి: