కర్ణాటకలో రాజకీయాలు ఏ రాష్ట్రంలో మలుపు తిరగలేనతంగా తిరుగుతాయి. మొన్నటి వరకు నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్  జేడీస్ సర్కార్ కూలిపోయింది. దానితో అవిశ్వాసం తీర్మానంలో యడ్యూరప్ప సర్కార్ కొలువు దీరింది. అయితే యడ్యూరప్ప సర్కార్ కొలువు తీరి ఇప్పటికే నెల రోజులు దాటిపోతున్న కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాలేదు. దీనితో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేలు ను స్పీకర్ అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.


అయితే బల పరీక్షలో నెగ్గిన బీజేపీ .. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వానికి పట్టిన గతి తమకు కూడా పడుతుందని బీజేపీ ఇప్పుడు భయపడుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనని యెడ్యూరప్ప సర్కార్ కు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. 


అయితే తిరుబాటు చేసిన ఫర్వాలేదు గాని ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. దీనితో యెడ్యూరప్ప ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. అయితే అమిత్ షా .. యెడ్యూరప్ప ఫైనల్ చేసిన మంత్రి వర్గ లిస్ట్ ను ఇంకా ఆమోదించ లేదు. భేటీ కూడా వాయిదా పడింది. యెడ్యూరప్ప ఫైనల్ చేసిన లిస్ట్ అమిత్ షా కు నచ్చలేదని తెలుస్తుంది. అమిత్ షా నే లిస్ట్ ను ఫైనల్ చేసి షీల్డ్ కవర్లో పంపిస్తారంట .. దీనితో అసలు సీఎంగా తనను పట్టించుకోవటం లేదని యడ్యూరప్ప వాపోతున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: