అమెరికాకు తాను తప్ప వేరే దిక్కు లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తనకే ఓటేసి గెలిపించాలని, లేకపోతే మీకే నష్టమని అమెరికన్లను బెదిరిస్తున్నారు. గత ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ నినాదంతో విజయం సాధించిన ట్రంప్.. ఇప్పుడు ట్రంప్ ఎగైన్ అంటూ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. 

2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో... అక్కడి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... ప్రజల నోట్లో తన పేరు నానేలా చేసుకుంటున్నారు. అమెరికన్లకు తానే దిక్కనీ, తనను గెలిపించకపోతే... అమెరికా పని అయిపోతుందని చెబుతున్నారు. ఆర్థిక మాద్యం వచ్చి... ప్రజలంతా రోడ్డున పడతారనీ, అమెరికా మరిన్ని అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీస్తుందనీ రకరకాల కామెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు.

ట్రంప్ మాటల్ని అలా ఉంచితే... మరోసారి ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాద్యం వచ్చేస్తుందేమోనన్న టెన్షన్‌లో ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ టెన్షన్ ఉంది.  2008లో ఇలాగే అమెరికాలో మాంద్యం వచ్చి... ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ మాంద్యం మాట ఎత్తడంతో... అమెరికాలో కలకలం రేగింది. ఆమెరికాలో ట్రంప్ పాలన అంత గొప్పగా ఏమీ లేదు. నిరుద్యోగం పెరిగింది, అప్పులు పెరిగాయి, వృద్ధి రేటు పడిపోయింది. ఓవరాల్‌గా అమెరికా పరిస్థితి ఏడ్చినట్లుంది. అందుకే ఓటర్లు... ట్రంప్‌ని చూసి తమ ఖర్మ అనుకుంటున్నారు. ఏదో చేస్తాడని గెలిపిస్తే... అడ్డంగా ముంచేస్తున్నాడని మండిపడుతున్నారు. ట్రంప్ మాత్రం... తన తప్పేమీ లేదనీ... అంతా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలా అవుతోందని చాడీలు చెబుతున్నారు. పైగా అమెరికా మీడియా కావాలని తనను టార్గెట్ చేస్తోందని ఫైర్ అవుతున్నారు. 

సహజంగానే బిజినెస్ పర్సనైన ట్రంప్... వాణిజ్యపరమైన అంశాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల అమెరికా వాణిజ్యం బాగా నెమ్మదించింది. చైనా లాంటి దేశాలు... ఆమెరికాకు దూరమవుతున్నాయి. దీనంతటికీ ట్రంపే కారణం అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. బలమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురాకపోతే... అమెరికాకు మాంద్యం కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.










మరింత సమాచారం తెలుసుకోండి: