ఆగస్టు 16 న మెడికల్ జర్నల్ బిఎమ్‌జెలో ప్రచురించిన ఒక లేఖలో, భారతదేశంలో‌   18 మంది వైద్యుల బృందం, భారత ప్రభుత్వం  జమ్ము లో  ప్రజల నిర్భందం చేసినందు వల్ల  జమ్మూ కాశ్మీర్‌లో చాలా మంది ప్రజలు ఆరోగ్య సంరక్షణను పొంద‌ లేక పోతున్నారని వారు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ప్రజారోగ్య వైద్యుడు డాక్టర్ రమణి అట్కూరి, మరో 17 మంది రాసిన లేఖలో “ఆరోగ్య సంరక్షణ హక్కును, జీవించే హక్కును నిర్భందించారు” అని వారు పేర్కొన్నారు. "కమ్యూనికేషన్,  ప్రయాణాలపై ఆంక్షలను త్వరగా తగ్గించాలని తద్వారా రోగులకు ఆరోగ్య సంరక్షణను అడ్డంకులు లేకుండా అనుమతించడానికి అవసరమైన ఇతర చర్యలను చేపట్టాలని" వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 "జబ్బుపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రజలు అంబులెన్స్‌కు కాల్ చేయడానికి ఈ ఆంక్షల వల్ల అవకాశం‌ లేకుండా పోయింది" అని లేఖలో పేర్కొంది. దాని వల్ల అనారోగ్య వ్యక్తిని "ప్రైవేట్ వాహనంలో" తీసుకెళ్లల్సి వస్తోంది.  "ఈ ప్రైవేట్ వాహనాలు కూడా ప్రతి కొన్ని మీటర్లకు భద్రతా దళాలు కాన్సర్టినా వైర్ బారికేడ్ల వద్ద ఆపి తమ  గుర్తింపును తనిఖీ చేయడానికి ఇంకా ప్రశ్నలు అడగడానికి ఆపుతున్నాతు దానివల్ల సమయానికి రోగులకి వైద్యం‌ అందటం  లేదు" అని రాశారు.

 లేఖ ప్రకారం, ఆసుపత్రులను చేరుకోవడంలో ఇబ్బందులు కేవలం  రోగులకు  మాత్రమే కాదు, సిబ్బంది కూడా ఉందని వారు అన్నారు. "ఆసుపత్రులలో ఉండాల్సిన  సామాగ్రి నిల్వ ఉన్నప్పటికీ, సిబ్బంది ఆసుపత్రికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంది,  సాధారణంగా రద్దీగా ఉండే ఆసుపత్రులు ఇప్పుడు చాలా
ఖాళీగా ఉన్నాయి ”అని కూడా లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వం మొదట్లో తుపాకీ గాయాలను ఖండించగా, ఆగస్టు 14 న శ్రీనగర్‌లో “విచ్చలవిడి నిరసన” కారణంగా తుపాకీ గాయాలు ఉన్నాయని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు. ఆ సమయంలో పోలీసులు చెప్పినదానిని ఈ లేఖ ధృవీకరిస్తుంది, మరిన్ని వివరాలను అందిస్తుంది.“చాలా మంది రోగులు గుళికల తుపాకీ గాయాలతో చేరారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి చేరుకోగలిగిన వారు మాత్రమే కొంత జాగ్రత్త తీసుకోగలరు. ” అని లేఖలో‌ పేర్కొన్నారు. ఆ సమయం‌లో చాలా మంది రోగులకు చికిత్స చేయించుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యిందని లేఖ లో రమణి అట్కూరి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: