ఏపీ ప్రతి పక్ష నాయకుడికి ఇప్పుడు అమరావతిలో స్వంత ఇల్లు లేకపోవటం బాబును ఇప్పుడు పొలిటికల్ గా బాగా ఇబ్బంది పెడుతుంది. ఐదేళ్లు సీఎంగా అధికారంలో ఉన్న చంద్రబాబు కనీసం ఒక స్వంత ఇల్లు కట్టుకోకపోవటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనితో ఇప్పుడు ఇదే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుంది. బాబును ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే ఇప్పుడు బాబు ఉంటున్న ఇల్లు కృష్ణ నది పక్కన ఉండటంతో అది అక్రమ కట్టడం అవ్వటంతో బాబును ఇంకా ఇరకాటంలోకి నెట్టేస్తుంది. కృష్ణా నది వరద తాకిడి తట్టుకోలేక హైదరాబాద్ కు మకాం మార్చేశారు. దీనితో అధికార పార్టీకి బాబు టార్గెట్ అయ్యారు.


కృష్ణా నది వరదలో తన ఇల్లు చిక్కుకుపోవటంతో చేసేదేమి లేక హైదరాబాద్ ఇంటికి తన మకాం మార్చారు. ప్రతి పక్షంలో జగన్ హైదరాబాద్ ఉన్నప్పుడు .. టీడీపీ నాయకులూ గాని , చంద్రబాబు గాని జగన్ ను పదే పదే విమర్శించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగన్ ఇప్పుడు ఏపీ సీఎంగా రాజధానిలోకి స్వంతంగా ఇల్లు కట్టుకున్నారు. కానీ బాబు గారు మాత్రం రాజధానిలో ఒక్క సెంటు ఇల్లు కూడా కొన లేదు. 


ఇప్పటీకే ఇదే విషయం మీద అధికార పార్టీ మంత్రులు వ్యంగ్యంగా స్పందించిన సంగతీ తెలిసిందే.  ఇప్పటీకే చంద్రబాబుకు ఇల్లు కావాలంటే ఇస్తామని ఆళ్ల రామకృష్ణ రెడ్డి చెప్పిన సంగతీ తెలిసిందే. సిగ్గులేకుండా ఇంకా అక్రమ కట్టడంలో ఉంటూ టీడీపీ నేతలు దిగజారి పోతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కూడా ఇల్లు కోసం ధరఖాస్తు చేసుకుంటే .. ప్రజలతో పాటు ఆయనకు కూడా వచ్చే ఉగాది లోపల ఇల్లు పట్టాను ఇస్తామని వ్యగ్యంగా సమాధానం చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు అర్జెంట్ గా అమరావతిలో ఇల్లు కొనకపోతే ఇంకా నష్టం. 

మరింత సమాచారం తెలుసుకోండి: