రాయపాటి సాంబ శివరావు .. టీడీపీ సీనియర్ నేత. ఆ పార్టీకి ఆర్ధికంగా, పార్టీలో మంచి పట్టున్న నేతగా పేరుంది. అయితే రాయపాటి గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తుంది. రాయపాటి పార్టీ మారబోతున్నాడని వార్తలు జోరుగా అందుకున్నాయి. నిజానికి ఎన్నికల ముందు రాయపాటి పార్టీ మారబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు టీడీపీ సానుభూతి పరుడు అయిన లగటి పాటి రాజ్ గోపాల్ రెడ్డి రంగంలోకి దిగి పార్టీ మారకుండా చూశాడని వార్తలు కూడా వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే ఏకంగా ఇదే విషయాన్ని లగటిపాటి కూడా ఒప్పుకున్న సంగతీ తెలిసిందే. అయితె ఇప్పుడు రాయపాటి వైసీపీలోకి మారటం ఖాయమని .. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. 


మొన్న ఆ మధ్య రాయపాటి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ పాలనా బాగుందని .. నవరత్నాలు ప్రజలకు చేరువయితే జగన్ ప్రజా నాయకుడిగా కీర్తించబడతాడని .. జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే నవరత్నాల అమలకు నిధుల కొరత ఉందని .. కేంద్రం సహకరించడం లేదని రాయపాటి చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజుల నుంచి రాయపాటి పార్టీ మారబోతున్నాడని ఒకటే టాక్ నడుస్తుంది. నిజానికి ఏ టాక్ ఎన్నికల ముందు కూడా వచ్చింది. కానీ ఎందుకో గాని రాయపాటి ఎన్నకలప్పుడు పార్టీ మారలేదు. 


అయితే ఇప్పుడు రాయపాటి వ్యాఖ్యలను చూస్తుంటే .. ఖచ్చితంగా వైసీపీ లోకి చేరడానికి హింట్ ఇస్తున్నాడని అర్ధం అవుతుంది. అయితే బీజేపీ పార్టీలోకి చేరతాడన్న ఊహాగానాలకు తెర పడిందని చెప్పాలి. రాయపాటి మూడ్ చేస్తుంటే వైసీపీ గూటికే చేరేందుకు ఇష్ట పడుతున్నారు. అయితే మొన్న రాయపాటి .. దక్షిణాన మొదట కేసీఆర్ సర్కార్ ను .. తరువాత జగన్ సర్కార్ ను కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందని బాంబు పేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: