తెలుగుదేశంపార్టీ బుద్ధి ఎప్పటికి మారదని అర్ధమైపోయింది. కష్టాల్లో ఉన్న జనాలకు బాధ్యతగల ప్రతిపక్షంగా సాయం అందిచాల్సిన సమయంలో బురద రాజకీయాలు చేస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులతో  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద పులుముతోంది. ఈ విషయం తాజాగా బయటపడింది. వరద సహాయక చర్యలపై ప్రభత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తు, ఆరోపణలు చేస్తు జనాలు మండిపడుతున్నారు.

 

చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే మీడియాతో పాటు టిడిపి సోషల్ మీడియాలో కూడా బాధితుల ఆక్రోసమంటూ విపరీతంగా ప్రచారం అవుతోంది.  నిజమైన బాధితులు ఎవరూ జగన్ పై అంతటి ఘాటు వ్యాఖ్యలు చేయటం లేదు. మరి వీళ్ళు ఎవరు అన్న విషయంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

 

వరద బాధితుల రూపంలో జగన్ పై మండిపడుతున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు టిడిపి పెయిడ్ ఆర్టిస్టులన్న విషయం బయటపడింది. మొన్నటి ఎన్నికల్లో కూడా వీళ్ళు చంద్రబాబును కీర్తిస్తు, టిడిపికి ఓట్లేయమంటూ ప్రకటనల్లో నటించారు. వాళ్ళనే ఇపుడు మళ్ళీ చంద్రబాబు, చినబాబు రంగంలోకి దింపారు. వాళ్ళతోనే జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి కుట్ర పన్నారు.

 

నిజానికి వరద మొదలైనపుడే కలెక్టర్లు, మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు క్షేత్రస్ధాయి సిబ్బంది మొత్తం ముంపు ప్రాంతాల్లో తిరిగారు. అవకాశం ఉన్నంతలో బాధితులకు సాయం చేశారు. ఇంకా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు సాయం అందుతోంది. సరే ఎక్కడైనా ఒకరిద్దరికి సాయం అందకపోయుండచ్చు కూడా. అంతమాత్రానా జగన్ ప్రభుత్వంపై అంతలా నోరు పారేసుకున్న బాధితులు ఎక్కడా కనబడలేదు. కానీ ఓ ఇద్దరు ముగ్గురు మాత్రమే అలా మాట్లాడటంతోనే టిడిపి బండారం మొత్తం బయటపడింది.

 

మొన్నటికిమొన్న ఆశా వర్కర్ల ఆందోళన అంటూ చంద్రబాబు ట్విట్టర్లో పెట్టిన ఫేక్ ఫొటో బయటపడింది. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజిలో ఓ నాటు పడవను అడ్డంపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచే కుట్ర జరిగిందని చినబాబు లోకేష్ పెట్టిన ట్విట్ నవ్వుల పాలైంది. ఇపుడు వరదలపై పెయిడ్ ఆర్టిస్టులతో తండ్రి, కొడుకులు చేయిస్తున్న బురద రాజకీయాలు బయటపడ్డాయి. మొత్తానికి జగన్ ను గబ్బు పట్టించాలన్న ధ్యేయంతో టిడిపినే గబ్బు పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: