ఆ మద్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా గుర్తుంది కదా..ఈ మూవీలో హీరో చిన్ననాటి నుంచి అంధుడు..కానీ వాళ్ల అమ్మ నటి రాధిక మాత్రం తన కొడుకును అంధుడు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుకు రానివ్వకుండా అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చి మంచి వారియర్ గా చేస్తుంది. ఈ మూవిలో ఉన్న హైలెట్ డైలాగ్ ‘ ఐ యామ్ బ్లైండ్..బట్ ఐ యామ్ ట్రైన్డ్’  ఇది సినిమాల్లో చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తుంటాయి.. కానీ ఇదే నిజజీవితంలో జరిగితే.. అవును పుట్టుకతోనే అంధుడైనప్పటికీ అతని కృషీ, పట్టుదల, కార్యదీక్ష ప్రస్తుతం ఐఏఎస్ ని చేసింది.  కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు అన్న దానికి అచ్చమైన ఉదాహారణ ఆ యువకుడు. 

అతని సంకల్పం ముందు అంధత్వం ఓడింది. పేదరికం తలవంచింది సత్యం. కృషి, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన, సంకల్పం ఉంటే చాలు అని నిరూపించాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరా అనకుంటున్నారా..తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కట్టా సింహాచలం 2018 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ట్రై నీ కలెక్టర్‌గా ముస్సోరీలో శిక్షణకు ఎంపికయ్యారు. గూడపల్లి గ్రామంలోని కట్టా వాలి, వెంకట నర్సమ్మలకు ఆయన జన్మించారు.  ఆ దంపతులకు  వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, సింహాచలం.. నలుగురు కుమారులు, ఒక కుమార్తె దుర్గ. పెద్దకుటుంబం కావడంతో వీరికి కుటుంబ కష్టాలు చాలా ఉండేవి. గోనె సంచలు వ్యాపారం చేస్తూ బతుకు సాగిస్తున్న ఈ కుటుంబంలో ఒక ఆణిముత్యం ఉందన్న విషయం అప్పుడు గమనించలేదు.

ఎలాగో అల ఆ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే  నాలుగో సంతానం అయిన సింహాచలం పుట్టుక తోనే అంధుడు కావడం తండ్రికి కుమారుడిని చదివించే  స్తోమత లేదు. అంత పేదరికంలో ఉన్నా కూడా సింహాచలం లో చదువుకోవాలనే పట్టుదల బాగా ఉండేది.  ఆ పేదరికంతోనే సింహాచలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్‌లో చదువుతూ మలికిపురం ఎంవీఎన్‌ జేఎస్‌ అండ్‌ ఆర్వీఆర్‌ డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశారు. తాను డిగ్రీ పూర్తి చేశాను అన్న సంతోషాన్ని తన తండ్రితో పంచుకుందామనుకున్న సింహాచలం కి ఓ చేదు వార్త వినిపించింది. 

తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలియంతో ఎంతో కుంగిపోయారు..అన్ని కష్టాలు పడి తన తండ్రి తాను ఓ మంచి పొజీషన్లోకి వస్తే చూసి సంతోషపడతాని అనుకున్న సింమాచలం కి నిరాశే మిగిలింది.  దీంతో కుటుంబానికి తాను భారం కాకూడదనుకున్న అతను ఐఏఎస్ కావాలని సంకల్పించుకున్నాడు ఆ క్రమంలోనే బీఈడీ కూడా చదివి తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచరు ఉద్యోగం లో చేరారు. పట్టుదల తో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం మొదలు పెట్టాడు సింహాచలం. 

2014 సంవత్సరంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు. కలెక్టర్‌ అయ్యే అవకాశం కొద్దిలో మిస్‌ అయింది. అయినా నిరాశ చెందలేదు. 2016లో ఐఆర్‌ఎస్‌లో రాణించి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఎట్టకేలకు 2019 ఐఏఎస్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించారు.  ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. 


సింహాచలం ఐఏఎస్ మాటల్లో.. మనిషికి అంగవైకల్యం ఉండొచ్చు..కానీ మనసుకు కాదు.  తాము అందరితో పోటీ పడలేము అన్న బాధకన్నా తామే అందరికీ పోటీ కావాలన్న కసి, పట్టుదల వారిలో ఉంటే ఏదైనా సాధించవొచ్చు.  అంగవైకల్యంతో ఉన్న ఎంతో మంది ఎన్నో అద్భుతాలు సృష్టించారు. నాకు ఉన్న ఆర్థిక పరిస్థితులు, కష్టాలు అందులోనూ నేను అంధుడిని అన్న విషయం గురించి ఆలోచించి ఉంటే..నా పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేది.  కానీ నేను అలా ఆలోచించలేదు..చదవాలి అందరితో పోటీ పడి మంచి ప్రయోజకుడిని కావాలి..నా కుటుంబాన్ని ఆదుకోవాలి, రక్షణగా ఉండాలనే పట్టుదల నాకు చిన్ననాడే కలిగింది. అందుకు అందరూ నాకు సహకరించారు..నన్ను ఈ స్థానానికి తీసుకు వచ్చారని ఎంతో నిడారంబరంగా చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: