ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో అడ్డంగా దొరికి పోయిన కాంగ్రెస్ పెద్దాయన పి. చిదంబరం ఇప్పుడు జైలు గోడల మధ్యలో గడపాల్సిన పరిస్థితి వస్తుంది. 2017 నుంచి అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి ఎన్నో స్టే లు తెచ్చుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. 


ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఢిల్లీ హై కోర్ట్ అరెస్ట్ విషయంలో స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా చిదంబరంకు స్టే ఇవ్వటంలో నిరాకరించింది. దీనితో 24  గంటలు అజ్ఞాతవాసంలోకి పోయిన చిదంబరం దిల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కనిపించారు.


అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్  నమోదు అయినంత మాత్రానా తప్పు చేసినట్టు కాదని చెప్పి అనంతరం జోర్బాగ్లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్ అభిషేక్ మను సింఘ్వీ కూడా వెళ్లారు. అప్పట్లో చిదంబరం కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి .. జైల్లో వేయించారు. దీనితో అమిత్ షా ఇప్పుడు అధికారంలో ఉండటంతో అది కూడా కీలకమైన హోమ్ మినిస్టర్ హోదాలో ఉండటంతో చిదంబరంను అరెస్ట్ చేయించి ప్రతి కారం తీర్చుకున్నాడని అర్ధం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: