ఒకే రూపంతో ఉండే వ్యక్తులు భూమిమీద ఏడుగురు ఉంటారని మన పురాణాల నుంచి చెప్తూనే ఉన్నారు. అప్పట్లో ఓ మాట ఉండేది .. హిట్లర్, సద్దాం హుస్సేన్ లు తమ డూపులు ఎక్కువగా వినియోగించుకునేవారని వార్తల్లో విన్నాం. అప్పుడప్పుడు మనలాంటి వ్యక్తులు కనిపించారని చెప్పినపుడు చాలా సంతోషంగా ఫీలవుతాం. మనం అంటే సరే.. కానీ, ప్రపంచంలో ఓ బలమైన నేతగా ఉన్న మోడీ లాంటి రూపంతో ఉన్న వ్యక్తులు ఉంటె.. వారికీ ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టే.
అంతేకాదు.. అలాంటి వాళ్ళు రాత్రికి రాత్రే సెలేబ్రిటిగా మారిపోతారు. ఉత్తర భారతదేశంలో అలాంటి వ్యక్తి ఒకరు ఇప్పటికే చాలాసార్లు చూశాం. అతను ఎక్కడికి వెళ్లినా.. ఆయనతో కలిసి ఫోటోలు దిగుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కూడా. అయితే, అలాంటి పోలికలతో ఉన్న వ్యక్తి తెలంగాణాలో కూడా ఉన్నాడు. షాక్ అవ్వకండి.. ఇది నిజం. ఆదిలాబాద్ జిల్లాలోని బొక్కలగడ్డకు చెందిన షేక్ అయ్యుబ్ అనే వ్యక్తి చూడటానికి అచ్చంగా మోడీలా ఉంటాడు.
ఆయన బస్సు డ్రైవర్. ఎవరైనా సరే ఆయన్ను సడెన్ గా చూస్తే మోడీ అనుకోని షాక్ అవుతారు. రూపురేఖలు, ముఖకవళికలు, రంగు, నడక అన్ని మోడీలా ఉంటాయి. బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతుంటారు. ఈ విషయం అటు ఇటు తిరిగి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇలా లీక్ కావడంతో అయన తెలంగాణా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అయన గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఎవరు ఏంటి.. ఎలా అని తెలుసుకోవడానికి ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు. మోడీ టీ అమ్మే వ్యక్తి నుంచి ప్రధానిగా ఎదిగారు.. ఇప్పుడు అయ్యుబ్ డ్రైవర్ గా చేస్తున్నాడు. మోడీ పోలికలతో ఉండటంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. అయ్యుబ్ కు ఓ కోరిక ఉందట. ఎప్పటికైనా మోడీతో కలిసి ఒకసారి ఫోటో దిగాలని కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందా.. ఈ విషయం మోడీ వరకు వెళ్తుందా.. మోడీ టీమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి.. ఎలాగైనా మోడీ దగ్గరకు ఈ విషయం తీసుకెళ్లారని అనుకుందాం. ఏమో వచ్చే ఎన్నికల్లో మోడీని పోలిన అయూబ్ కు తెలంగాణ నుంచి టికెట్ ఇవ్వోచ్చేమో.. చెప్పలేం కదా.