కోడెల శివ ప్రసాద్ కు రానున్నవి కష్ట కాలాలు అని చెప్పాలి. గత ప్రభుత్వంలో కన్ను మిన్ను తెలియకుండా ఇష్టారాజ్యంగా తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఓడిపోవటంతో కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. కోడెల అవినీతి బాగోతం మొత్తం బయటికి వస్తుంది. కే టాక్స్ అంటూ కోడెల ఫ్యామిలీ సాగించిన వ్యవహారం పోలీసుల కేసుల దాకా పోయింది. ఆ కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ రావటం లేదు. లోకేష్ గాని చంద్రబాబు గాని కోడెలకు సపోర్ట్ పక్కన పెడితే తప్పు చేస్తే శిక్షించమని చంద్రబాబు చెప్పుకొచ్చారు అంతే గాని కక్ష సాధింపులకు దిగితే సహించేది లేదని చెప్పారు. అంటే బాబు .. కోడెల తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా !


అయితే కోడెల పై ఇప్పటికే నియోజక వర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫర్నిచర్ దొంగతనంలో కేసులో దొరికి పోయేసరికి కోడెల పరువు మొత్తం బజారుకు చేరింది. అడ్డంగా దొరికి పోయిన తరువాత ఇప్పుడు ఫర్నిచర్ ను ఇచ్చేస్తానని కోడెల చెప్పడం ... దీన్ని కోడెలను ఏమనాలో కూడా ప్రజలకు అర్ధం కావటం లేదు. ఇటువంటి ప్రజా ప్రతి నిధి ప్రప్రంచంలో ఎక్కడా కనిపించడని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే కోడెల మీద అంబటి రాయడు విరుచుకుపడ్డారు.


కోడెల కుటుంబం పెద్ద గజ దొంగలు కుటుంబమని పోలీసుల కేసుల్లో ఉండి పారిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారని అంబటి చెప్పుకొచ్చారు. కోడెల దొరికిన దొంగని .. చంద్రబాబు దొరకని దొంగని అంబటి ఆరోపించారు. అయితే కోడెల మీద అభియోగాలు చాలా ఉన్నాయి. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: