భారతీయ జనతా పార్టీ -  తెలంగాణ భవిష్యత్తు మార్చగలదు

ఎంతోమంది అమర వీరుల త్యాగఫలం అయినా ఈ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి  బంగారు మయం చేసి సస్యశ్యామలం గావించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే  చేయగలదని భారతీయ జనతా పార్టీ నాయకుడు, సినీ నటుడు శ్రీ బాబు మోహన్ చెప్పారు.  

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి, అమరులు అయితే  వారి త్యాగ ఫలితాన్ని వేరొకరు అనుభవిస్తున్నారని బాబు మోహన్ పరోక్షంగా కెసిఆర్ ను   దెప్పి పొడిచారు. ప్రజల గురించి ఏమాత్రం శ్రీ కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,  స్వలాభం కోసమే పనిచేస్తుందని బాబు మోహన్ అన్నారు.

శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం కేంద్రంలో  చేస్తున్నా అద్భుతాలను తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారని  రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ లో అధికారం కైవసం చేసుకుంటుందని,  భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని, బంగారు తెలంగాణ సాధించాలి అంటే  భారతీయ జనతా పార్టీ ఒక్కటే శరణ్యమని శ్రీ బాబు మోహన్ అభిప్రాయపడ్డారు.

 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజా స్పందన చూస్తుంటే  చాలా ఆనందంగా ఉందని భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు  చాలా మక్కువ చూపుతున్నారని భవిష్యత్తులో తెలంగాణలో అధికారం ఇచ్చి ఆశీర్వదించి   తీరుతారు అని శ్రీ బాబు మోహన్ జోస్యం చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: