ఈ మధ్యనే వెస్టిండీస్తో జరిగిన ఆఖరి వన్డే మ్యచ్లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీతో 20వేలకు పైగా పరుగులు ఒక దశాబ్దంలో అన్ని ఫార్మెట్లలో కలిపి చేసిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అయితే కోహ్లీ కేవలం క్రికెట్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా రికార్డు బ్రేక్ చేశాడు. సోషల్ మీడియాలో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో సరికొత్త రికార్డు సృష్టించాడు.
సోషల్ మీడియాలోని 'ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్'లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్లలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉండగా, టీం ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
ట్విట్టర్లో సచిన్ను 30 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఫేస్బుక్లో 28, ఇన్స్టాగ్రామ్లో 16.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్గా ఉండని ధోనీని ట్విట్టర్లో 7.7, ఫేస్బుక్లో 20.5, ఇన్స్టాగ్రామ్లో 15.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఏది ఏమైనప్పటికి విరాట్ కోహ్లీ తన క్రికెట్ తో మైదానంలో తన అందంతో సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు.