కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా `ఛలో` చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత రష్మిక నటించిన రెండో చిత్రం `గీత గోవిందం`తో మంచి హిట్ అందుకుంది. అటు కన్నడ ఇటు తెలుగు చిత్రలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా విడదల అయిన `డియర్ కామ్రేడ్` చిత్రంలో మరో సారి రష్మిక విజయ దేవరకొండతో కలిసి జత కట్టింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించేందుకు ఈ కన్నడ ముద్దుగమ్మకు ఛాన్స్ దొరికింది.
‘సరిలేరు నీకెవ్వరు’ పేరిట తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్తో కలిసి నటింస్తున్న రష్మికకు బాగా ఎగ్జయింటింగ్గా ఉంది. టాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక చాలా తక్కువ సమయంలోనే పాపుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో రూమార్లు కామన్. అయితే రష్మికపై కూడా ప్రస్తుతం రూమర్లు ఫ్లో అవుతున్నాయి.
విజయదేవరకొండ మరియు రష్మిక కలిసి నటించిన `గీత గోవిందం` మరియు `డియర్ కామ్రేడ్` చిత్రాలలో వీరిద్దరి మధ్య రొమాన్స్ మరింత ఎక్కువగా ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరియు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే రష్మిక తన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరిద్దరూ క్లోజ్గా ఉండడంతో ఈ వార్తలు మరింత బలంగా వినిపించాయి. అయితే వీటకి చెక్ పెడుతూ రష్మిక స్పందించింది. తాము కేవలం స్నేహితులమే అని అంతకు మించి తమ మధ్య ఏం లేదని స్పష్టం చేసి ఈ పుకార్లకు పులిస్టాప్ పెట్టింది. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.