రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ డిఫరెంట్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన సుజీత్, తన తరువాత సినిమా సాహోను ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా  ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో పెద్ద సెన్సేషన్ సృష్టించాయి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ వారు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని జీబ్రాన్ అందిస్తున్నారు. 

ఇక మొన్న ఆదివారం ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక, సినిమా యూనిట్ సభ్యులు, అభిమానులు మరియు సినీ ప్రముఖుల సమక్షంలో ఎంత అద్భుతంగా జరిగినదో తెలిసిందే. హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధ కపూర్, దర్శకుడు సుజీత్ సహా, ప్రతి ఒక్కరు సినిమా విజయం కోసం ఏంటో కష్టపడ్డారని, ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ, ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినవారు, సాహో టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఇకపోతే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ని సంపాదించిన ఈ సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత, తదుపరి చేయబోయే సినిమాపై దర్శకుడు సుజీత్ అప్పుడే పనులు మొదలు పెట్టాడని కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

సుజీత్ ఇటీవల కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ను కలవడం జరిగిందని, అయితే మాటల సందర్భంలో తనవద్ద ఒక ఫెంటాస్టిక్ స్టోరీ ఉంది, మీరు వింటాను అంటే వినిపిస్తాను సర్ అని మహేష్ తో అన్నాడట. అయితే సూపర్ స్టార్ ఓకే చెప్పిన తరువాతి రోజునే సుజీత్, సూపర్ స్టార్ కు స్టోరీ చెప్పడం, ఆ కథ ఆయనకు బాగా నచ్చడంతో, త్వరలో దానిని మొదలెడదాం అని సుజీత్ కు  మాటివ్వడం కూడా జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు వెల్లడి కావాలంటే, వారిద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమా విషయమై నోరు విప్పాల్సిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు....!! 
 


మరింత సమాచారం తెలుసుకోండి: