టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన కెరీర్ 150వ సినిమాగా, రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ డూపర్ హిట్ ని సాధించి, టాలీవుడ్ లో మెగాస్టార్ స్టామినా ఇంకా తగ్గలేదని మరొక్కసారి రుజువు చేసింది. అయితే దాని తరువాత ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి, ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకుని, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా జోడి కడుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మరియు కోలీవుడ్, శాండల్ వుడ్  కి చెందిన ప్రముఖ నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.300 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు సమాచారం. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి, వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమా గురించి, ఇప్పటికే పలు మీడియాల మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి. కొందరైతే ఈ సినిమాలో మెగాస్టార్ రైతుగా నటిస్తున్నారని అంటుంటే, మరికొందరేమో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఇంకొందరేమో ఎన్నారై గా నటిస్తున్నారని వార్తలు ప్రచారం చేయడం జరిగింది. 

అయితే ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్తలన్నిటికీ మొన్న తానిచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్, ఒక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టినట్లు సమాచారం. ఆయన మాట్లాడుతూ, త్వరలో కొరటాల గారితో నేను చేయబోయే సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలన్నీ కూడా ఒట్టి రూమర్లే అని, అయితే ఆ సినిమాలో తాను ఎటువంటి పాత్రలో నటిస్తున్నాను, హీరోయిన్ ఎవరు, అలానే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలన్నీ అతి త్వరలో ప్రారంభము అయ్యే ఆ సినిమా పూజా కార్యక్రమాల రోజున వెల్లడించనున్నాం అని సమాధానమిచ్చారట......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: