ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌. ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 24న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో... 


హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ మాట్లాడుతూ - ''తమిళ్‌లో ఎలా మంచి రివ్యూస్‌, రెస్పాన్స్‌ వచ్చిందో అంతకన్నా మంచి రెస్పాన్స్‌ తెలుగులో కూడా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. థియేటర్స్‌లో 70 పర్సెంట్‌ ఆక్యుపెన్సీ ఉంది. చాలా మంచి సినిమా అని మౌత్‌ పబ్లిసిటీ కూడా చాలా బాగుంది. అలాగే బుక్‌మై షో లో 92 పర్సెంట్‌ అప్రిసియేషన్‌ ఉంది. మీడియా మంచి సహకారం ఉంది. 'కౌసల్య కృష్ణమూర్తి' లాంటి మంచి సినిమాలను సపోర్ట్‌ చేస్తేనే మా లాంటి యంగ్‌స్టర్స్‌కి విభిన్న తరహా చిత్రాల్లో నటించడానికి, మంచి సినిమాలు రూపొందడానికి ఉపయోగపడుతుంది. బ‌హుశా నేను కొత్త అమ్మాయి కావ‌డంతో థియేట‌ర్స్‌కి త్వ‌ర‌గా రావ‌డం లేదేమో అనిపిస్తుంది. అలాగే మొన్న ఎవ‌రో విలేక‌రి అన్న‌ట్లు నా ఎంట్రీ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో ఉండి ఉంటే ఆద‌రించేవారేమో అనిపిస్తుంది. కాని సినిమా చాలా బావుంది అంద‌రూ వెళ్లి చూడండి.  నిన్న మా టీమ్‌ అందరం హైదరాబాద్‌ శాంతి థియేటర్‌లో సినిమా చూశాం. మంచి రెస్పాన్స్‌ ఉంది. చాలా సంవత్సరాల తరువాత మరో గొప్ప సినిమా చూశాం అని చెప్పడం హ్యాపీగా ఉంది. అందరూ థియేటర్‌లోనే సినిమా చూడండి'' అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: