జమ్ములో రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి.ఎప్పుడు ఎలా ఉంటోందో తెలియక ప్రజలు బయపడుతున్నారు.అక్కడి పరిస్థితులను ఒకొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. జమ్మూకశ్మీర్ లో తాజా పరిస్థితి పై జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత షీలా రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో నిత్యావసరాలు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆమె ట్వీట్ చేశారు. స్థానిక పోలీసులకు ఎలాంటి అధికారాలూ లేవని మిలటరీ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇళ్లల్లోకి ఆర్మీ జవాన్లు చొరబడి యువకుల్ని అకారణంగా తీసుకెళ్తున్నారని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితి పై పది అంశాలతో ట్వీట్ చేశారు షీలా రషీద్. జమ్మూకాశ్మీర్ లో మీడియా నిలిపివేయబడింది గ్యాస్ స్టేషన్ లో అన్ని మూసివేసారు.


మందుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎలాంటి సమాచారం స్థానికులకు చేరడంలేదు అతి కొద్దిమందికి మాత్రమే టీవీ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ పోలీసులకు శాంతి భద్రతలపై ఎలాంటి అధికారాలూ లేవు. అంతా పారామిలిటరీ దళాల చేతుల్లో ఉంది. సీఆర్ పీఎఫ్ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను బదిలీ చేశారు. ఎస్ హెచ్ వోలు వారి లాఠీలు మోస్తున్నారు. సర్వీస్ రివాల్వర్ ను వారు కన్నెత్తి కూడా చూడటం లేదు. పారామిలిటరీ బలగాలు రాత్రి సమయాలలో ఇళ్లలో కి ప్రవేశించి యువకుల్ని తీసుకువెళుతున్నారు.



ఇళ్లల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న రేషన్ సరుకులు చెల్లాచెదురు చేస్తున్నారు. షోపియన్ లో నలుగురు యువకుల్ని ఆర్మీ క్యాంపస్ లోకి పిలిచి విచారించారు, హింసించారు. ఒక మైక్ వారి దగ్గర పెట్టి వారి అరుపుల్ని ఆ ప్రాంతం లోని వారికి వినిపిస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. ఇలాంటి భయానక వాతావరణం జమ్మూ కశ్మీర్ లో ఉంది అని షీలా రషీద్ ట్వీట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: