కాని ఈ కాలంలో మూడు ముళ్ల బంధమంటే మూడు రాత్రుల ముచ్చటగా మిగిలిపోతుంది.అందుకే విలువ లేకుండా పోయింది పెళ్ళికి..ఇదంతా ఎందుకు చెబుతు న్నానంటే ఈ మధ్య మగాళ్లు కట్టుకున్న దాన్ని ఎలా వదిలించు కోవాలి,ఎలా చంపాలి లాంటి ప్లాన్స్ చాలా వేస్తున్నారు,మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అలానే తయారయ్యారు.ఇక్కడ ఓ మగాడు పెళ్లన్ని మమూలుగా చంపితే కిక్కెక్కడుంటుందనుకున్నాడో ఏమో వైరటి ప్లాన్ వేసాడు అదెక్కడో చూద్దాం.
కృష్ణా జిల్లా నందిగామ మండలంలో నిద్రిస్తున్న భార్యకు కరెంటు షాక్ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త.నందిగామ మండలం అంబారుపేటకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి తన భార్య అరుణ నిద్రిస్తున్న సమయంలో కరెంటు షాక్ ఇచ్చి చంపేందుకు ప్రయత్నించాడు.బాధ తట్టుకోలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకొని వస్తున్నారని గ్రహించిన జానకిరామయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అరుణను నందిగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఆమె పరిస్దితి కాస్త విషమంగానే వుందని ప్రస్తుతం సృహలో లేదని డాక్టర్స్ తెలిపారట..